క్షణికావేశంలో కుంటలో పడి మహిళ ఆత్మహత్య
కుటుంబ కలహాలతో కలత చెందిన ఓ మహిళ క్షణికావేశంలో కుంటలో పడి ఆత్మహత్యకు పాల్పడింది.
దిశ, కామారెడ్డి : కుటుంబ కలహాలతో కలత చెందిన ఓ మహిళ క్షణికావేశంలో కుంటలో పడి ఆత్మహత్యకు పాల్పడింది. దేవునిపల్లి ఎస్సై రాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన సుంకం విజయ (38) అనే మహిళ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రామేశ్వర్ పల్లి శివారులో గల పల్లెవాని కుంటలో పడి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. కుటుంబ కలహాల వల్లనే ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. భర్త లింబాద్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు.