చెరువులో పడి వ్యక్తి మృతి

ఎల్లారెడ్డి మండలంలోని జంగమయపల్లి గ్రామానికి చెందిన చాకలి సాయిబాబా చెరువులో పడి మృతి చెందాడు.

Update: 2024-02-22 14:40 GMT

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మండలంలోని జంగమయపల్లి గ్రామానికి చెందిన చాకలి సాయిబాబా చెరువులో పడి మృతి చెందాడు. మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలం జంగమయ్య పల్లి గ్రామానికి చెందిన చాకలి సాయిబాబా 13 సంవత్సరాల క్రితం లింగంపేట మండలం శట్ పల్లి గ్రామం నుండి ఎల్లారెడ్డి మండలం జంగమయ్య పల్లి గ్రామానికి చెందిన చాకలి కలవ్వకు ఇల్లరికం వచ్చాడు. తన పొలం వద్ద నీరు పెట్టడానికి బోరు మోటార్ వేయడానికి దామర చెరువు కట్ట పై నుంచి వెళుతుండగా కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.


Similar News