9 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్​

నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెద గ్రామ శివారులోని పటేల్ చెరువు వద్ద మంగళవారం పేకాట ఆడుతున్న 9 మంది వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై రాజు తెలిపారు.

Update: 2024-02-20 15:07 GMT

దిశ, నాగిరెడ్డిపేట్ : నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెద గ్రామ శివారులోని పటేల్ చెరువు వద్ద మంగళవారం పేకాట ఆడుతున్న 9 మంది వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై రాజు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం మధ్యాహ్నం పటేల్ చెరువు ప్రాంతంలో 9 మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు వెళ్లి దాడులు నిర్వహించగా పేకాట ఆడుతున్న 9 మందిని పట్టుకున్నామని, వారి వద్ద నుండి 8 వేల 230 రూపాయల నగదును తో పాటు 4 మొబైల్ ఫోన్లను స్వాధీన పరచుకున్నట్లు ఎస్సై తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజు తెలిపారు.


Similar News