కేంద్రంలో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం అని, దేశ ప్రజలందరూ ప్రధాని నరేంద్ర మోదీ పాలన కోరుకుంటున్నారని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.

Update: 2024-03-02 14:09 GMT

దిశ, కామారెడ్డి : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం అని, దేశ ప్రజలందరూ ప్రధాని నరేంద్ర మోదీ పాలన కోరుకుంటున్నారని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. విజయ సంకల్ప యాత్ర కామారెడ్డికి చేరిన సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కూడా అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలుస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కానీ తీరు మారలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార తో పాటు బీజేపీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Similar News