నార్సింగి వివాహిత రేప్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు

నార్సింగిలో వివాహిత కిడ్నాప్, రేప్ ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.

Update: 2023-02-20 07:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: నార్సింగిలో వివాహిత కిడ్నాప్, రేప్ ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు గంటల వ్యవధిలో అరెస్ట్ చేశారు. నిందితులను బాచుపల్లికి చెందిన శుభంశర్మ, సుమిత్ శర్మను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మహిళను తొలుత కిడ్నాప్ చేసిన కారు డ్రైవర్లు మహిళతో బలవంతంగా మద్యం తాగించారు. వివాహిత స్పృహ కోల్పోగా నిందితులు కారులో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత మహిళను గండిపేట వద్ద వదిలివెళ్లారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు నిందితులను గంటల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై 365, 376(2)(జి), 392, 342 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Tags:    

Similar News