ఘోర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురి యువకులు మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు.

Update: 2024-09-30 16:22 GMT

దిశ, చిలుకూరు, కోదాడ: మండల పీఎస్ పరిధిలోని కోదాడ - హుజూర్నగర్ రహదారిపై సాగర్ కాలువ దగ్గర సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ములకపట్నం గ్రామానికి చెందిన వల్లబుదాసు వంశీ ( 22), మాడుగులపల్లి మండలం ఆగా మోత్కూర్ కి చెందిన అవిరెండ్ల శ్రీకాంత్ (21), మలికంటి దినేష్ (22) సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు నిమిత్తం కోదాడ వచ్చారు. అనంతరం రాత్రి ఒకే బైక్ పై కోదాడ నుంచి హుజూర్ నగర్ వెళుతుండగా గుర్తు తెలియని వాహనం వీరి బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ ఉన్న ముగ్గురి తలలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. దినేష్ తండ్రి రెండు వారాల క్రితం వాహన ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోదాడ గ్రామీణ సీఐ రజితా రెడ్డి, చిలుకూరు ఎస్సై రాంబాబు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.


Similar News