పులిచింతలకు పెరుగుతున్న వరద ప్రవాహం..

పులిచింతల ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతం నాగార్జున సాగర్ నుండి 18 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది.

Update: 2024-10-20 04:09 GMT

దిశ, చింతలపాలెం : పులిచింతల ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతం నాగార్జున సాగర్ నుండి 18 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు ముందస్తుగా 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల వరకు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 42.16 టీఎంసీలుగా ఉంది.

పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులకు గాను ఇప్పటి వరకు నీటిమట్టం 173.78 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 1,72,360 క్యూసెక్కు లు కాగా రెండు ప్రాజెక్టు రేడియల్ గేట్లు 3 మీటర్లు, రెండు రేడియల్ గేట్లు 3.5 మీటర్లు, మూడు రేడియల్ గేట్లు రెండు మీటర్లు మేర ఎత్తి 1,71,243 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎడమవైపున ఉన్న విద్యుత్ కేంద్రం నుండి విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. పులిచింతల విద్యుత్ కేంద్రం పూర్తి సామర్థ్యం 120 యూనిట్లు కాగా నాలుగు యూనిట్ల నుండి 110 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని ఎస్ఈ దేశ్యా నాయక్ తెలిపారు. విద్యుత్ ఉత్పాదన కోసం 16,000 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు.


Similar News