పిడుగుపాటుకు తెగిన విద్యుత్ వైరు.. మహిళా రైతు కూలీ మృతి..

రాత్రి ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షంలో విద్యుత్ వైర్ తెగి పడడంతో విద్యుత్ షాక్ కు గురై వ్యవసాయ కూలీ మృతి చెందింది.

Update: 2024-10-20 09:52 GMT

దిశ, రామన్నపేట : రాత్రి ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షంలో విద్యుత్ వైర్ తెగి పడడంతో విద్యుత్ షాక్ కు గురై వ్యవసాయ కూలీ మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన మండలంలోని తుమ్మలగుడంలో చోటుచేసుకుంది. బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని తుమ్మలగూడెం గ్రామానికి చెందిన ఆవుల పద్మ (45) ఆదివారం ఉదయం తన పొలంలోని వరి కోయించేందుకు వెళ్లిందన్నారు. రాత్రి ఉరుములు మెరుపులతో పిడుగు పడడం వల్ల పొలంలో విద్యుత్ లైన్ తెగి పడిందని తెలిపారు. అది గమనించకుండా మృతురాలు పద్మ నడుచుకుంటూ వెళ్తూ తెగిపడిన విద్యుత్ తీగకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు ఆవుల లింగస్వామి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిపారు.


Similar News