రోడ్డు దాటుతుండగా ప్రమాదం...వ్యక్తి మృతి

ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని గాగిల్లాపూర్ స్టేజి రాజీవ్ రహదారిపై జరిగింది.

Update: 2024-10-20 15:49 GMT

దిశ, బెజ్జంకి: ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని గాగిల్లాపూర్ స్టేజి రాజీవ్ రహదారిపై జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి బెజ్జంకి క్రాసింగ్ గ్రామానికి చెందిన బింగి స్వామి (42) బైక్ ను ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించగా మెరుగైన వైద్యం కోసం పేపర్స్ సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుడు బింగి వంశీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.


Similar News