తిరుపతి జిల్లాలో కూంబింగ్.. ముగ్గురు స్మగ్లర్ల అరెస్ట్

తిరుపతి జిల్లా భాకరాపేట శేషాచల అటవీప్రాంతంలో ఎర్రచందనం యధేచ్చగా స్మగ్లింగ్ జరుగుతోంది..

Update: 2024-10-20 16:52 GMT

దిశ, వెబ్ డెస్క్:  తిరుపతి జిల్లా భాకరాపేట శేషాచల అటవీప్రాంతంలో ఎర్రచందనం యధేచ్చగా స్మగ్లింగ్ జరుగుతోంది. పచ్చని చెట్లను కొట్టి దుంగలను అమ్ముకుంటున్నారు. వాహనాల్లో అక్రమంగా తరలిస్తు్న్నారు. పోలీసుల నిఘా ఉన్నా పట్టించుకోవడం లేదు. స్మగ్లర్లు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. పోలీసులు తనిఖీలు చేస్తే దాడులకు ప్రయత్నిస్తున్నారు. లేదంటే దుంగలను అక్కడే వదిలి పారిపోతున్నారు.

ఎర్రచందనం జరుగుతుందన్న సమాచారంలో పోలీసులు భాకరాపేట శేషాచల అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. కోటబయలు దగ్గర 14 ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు కారులో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా రైడ్ చేశారు. దీంతో ముగ్గురు దుండగులు దొరికిపోయారు. మరికొంతమంది పారిపోయారు. 14 ఎర్రచందనం దుంగలు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 


Similar News