భువనగిరి మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏర్పాటు..
భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.రఘునందన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా భువనగిరి మండల పరిధిలోని బొల్లెపల్లికి చెందిన కనుకుంట్ల రేఖ బాబురావు, వైస్ చైర్మన్గా బైసు రాజేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా కొలిచిలిమి శ్యామ్, తాడూరి నరసింహ, బానోతు దేవిసింగ్, మద్ది అంజిరెడ్డి, రేణిగుంట లాలయ్య, చిన్నం శ్రీనివాస్, పిట్ట రజిత, కుక్క దానయ్య, దిరావత్ శ్రీను, దేశెట్టి చంద్రశేఖర్, రంగ కృష్ణయ్య, బీబీనగర్ పీఏసీఎస్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, భువనగిరి వ్యవసాయ సహాయ సంచాలకులు, భువనగిరి మున్సిపల్ చైర్మన్ ను నియమిస్తూ ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది.