ప్రజావాణికి ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి...

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిచ్చి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.

Update: 2025-03-17 13:26 GMT
ప్రజావాణికి ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి...
  • whatsapp icon

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిచ్చి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం ప్రజావాణిలో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి స్వీకరించారు. ప్రజావాణికి వివిధ ప్రాంతాల ప్రజల నుండి 58 అర్జీలను రాగా సంబంధిత అధికారులు దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు.

రెవెన్యూ శాఖ 34, జిల్లా పంచాయతీ శాఖ 11, మున్సిపాలిటీ 3, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ 2, సివిల్ సప్లైస్ 2, దేవాదాయ శాఖ 2, జిల్లా కో ఆపరేట్ , ఆర్ అండ్ బీ, జిల్లా సంక్షేమ, లేబర్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి. ప్రజావాణి అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్టేట్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి పరిష్కరించాలన్నారు. వివిధ శాఖలలో పెండింగ్ ఉన్న సంక్షేమ అభివృద్ధి పనుల పై సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభా రాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Similar News