ఇది వాగు కాదు.. హైవే..!

Update: 2024-08-31 09:01 GMT

దిశ, మాడుగులపల్లిః మాడుగులపల్లి మండల కేంద్రంలో రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి అద్దంకి నార్కెట్ పల్లి హైవేపై నీరు నిలవడంతో చెరువును తలపిస్తున్నట్టు ఉంది. దీంతో వాహన దారులకు అంతరాయం కలిగింది. రోడ్డు ఒకవైపు నుంచే వాహన రాకపోకలు కొనసాగాయి. మండల ప్రజల అవస్థను పట్టించుకునే ప్రభుత్వ అధికారులే కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు. పలుమార్లు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా టోల్గేట్ యజమాన్యానికి సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని విమర్శిస్తున్నారు. నామ్ ఎక్స్ ప్రెస్ వే టోల్ యాజమాన్యం తప్పిదం వల్ల రోడ్డు డౌన్ చేయడంతో రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. దీంతో నామ్ ఎక్స్ ప్రెస్ వే టోల్ సిబ్బంది మోటార్ల ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నారు. ఎప్పుడు వర్షం వచ్చినా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని మండల ప్రజలు వాపోతున్నారు.


Similar News