MLA Jagadish Reddy : అధైర్యపడొద్దు..అండగా నిలబడతా..

సూర్యాపేటలో ప్రజలు హైడ్రా అనే పేరుతో అనేక భయబ్రాంతులకు

Update: 2024-09-29 10:34 GMT

దిశ,సూర్యాపేట : సూర్యాపేటలో ప్రజలు హైడ్రా అనే పేరుతో అనేక భయబ్రాంతులకు గురవుతున్నారని,వారెవ్వరు అధైర్య పడవద్దని మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. వారికి నేను ఎల్లప్పుడూ అండగా నిబడతానని భరోసా ఇచ్చారు.ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజల పక్షాన పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు.గత ప్రభుత్వంలో కేసీఆర్ అభివృద్ధి చేస్తే నేడు కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తుందని విమర్శించారు. కేసీఆర్ అభివృద్ధి నిర్మాణాలు చేస్తే,ఆ అభివృద్ధి సంక్షేమాలు మరిచిన కాంగ్రెస్ అరాచకాలు చేస్తుంటే మున్ముందు ప్రజల్లో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.ప్రజలను కన్నీళ్లు పెట్టించడం సమాజానికి మంచిది కాదని ఉద్ఘాటించారు.

అందుకు సూర్యాపేటలో బాధితులు అనుకునే వారు ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని,అందుకు ఆ కుటుంబాలకు తామంతా భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా పలు వార్డులకు చెందిన పలు కుటుంబాలకు చెందిన సభ్యులు మాట్లాడుతూ తామంతా గత ఐదు రోజులుగా నిద్రాహారాలు మాని భయాందోళనకు గురవుతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్వయంగా వచ్చి మా దగ్గరకు వచ్చి అండగా ఉంటామని ధైర్యం చెప్పడంతో మేమంతా ప్రశాంతంగా ఉన్నామని ముక్త కంఠంతో చెప్పారు.ఈ సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్,మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్,నాయకులు అంగిరేకుల నాగార్జున పాల్గొన్నారు.


Similar News