మహిళల కోసం మెగా జాబ్ మేళా.. ఎక్కడంటే..?
శ్రీ కాకతీయ సెక్యూరిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అటానమస్ లో రేపు 22-03-2025 ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు.

దిశ,నల్లగొండ: శ్రీ కాకతీయ సెక్యూరిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అటానమస్ లో రేపు 22-03-2025 ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా విద్యార్థినిలు 10 తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ మరియు పాలిటెక్నిక్ లో ఉత్తీర్ణులు, లేదా ఫెయిల్ విద్యార్థినులు కూడా అర్హులు. ఇది ప్రత్యేకంగా విద్యార్థినుల కోసమే నిర్వహించడం జరుగుతోంది. దీంతో భాగంగా దాదాపు 500 ఖాళీలు కలవు. జీతభత్యాలు హాస్టల్ అలవెన్స్ తో కలిపి 17200 వరకుg ఉంటుంది. వయస్సు 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాలు లోపు కలవారు అర్హులు. ఈ మెగా జాబ్ మేళాకు జిల్లాలోని విద్యార్థులు అందరూ ఉపయోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు తెలిపారు. మిగతా వివరాలకు కళాశాల టి.ఎస్.కే.సి సమన్వయకర్త ఈ.రామ్ రెడ్డి 9989217045 మరియు శ్రీనివాసులు ను సంప్రదించాలని కోరారు.