పోలీసుల చేతుల్లో గంజాయి కిట్లు.. ఇక ఈజీగా పట్టేయొచ్చు

Update: 2024-08-29 07:19 GMT

దిశ, నల్లగొండ : నల్లగొండ జిల్లా పోలీసుల చేతికి గంజాయిని సేవించిన వారిని వెంటనే గుర్తించే కిట్లు వచ్చేశాయి. వీటి విలువ సుమారు 800 నుండి 1000 రూపాయల వరకు ఉంటుంది. దీనిని ఒక వ్యక్తికి ఒకసారి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంత విలువైన కిట్లను ఉపయోగించడానికి గల కారణం గంజాయి రహిత సమాజం ఏర్పాటు చేయడమే అని స్పష్టంగా తెలుస్తోంది. నల్లగొండ జిల్లా కేంద్రంలో రాత్రుళ్ళు రోడ్ల మీద తిరిగే వారే ప్రధాన లక్ష్యం చేసుకొని ఈ కిట్లను వాడుతునట్లు తెలుస్తుంది. ఈ కిట్ల ద్వారా గంజాయి సేవించిన వారి మూత్ర పరీక్ష ద్వారా 2 నిమిషాల్లో తెలుస్తుంది. గంజాయి తీసుకున్నారా లేదా అనేది. అందుకే గంజాయి బాబులు గంజాయి సేవించడం మానేసి మంచి సమాజం స్థాపనకు కృషి చేయాలని దిశ కోరుకుంటోంది.


Similar News