తండ్రికి కూతురే కొడుకు.. తలకొరివి పెట్టి దహన సంస్కారాలు

కన్నతండ్రి అనారోగ్యంతో అకాల మరణం చెందాడు.

Update: 2024-10-22 14:07 GMT

దిశ చివ్వేంల: కన్నతండ్రి అనారోగ్యంతో అకాల మరణం చెందాడు. మృతుడికి ఒక్కగానొక్కకూతురు కావడం తో..తండ్రికి తలకొరివి పెట్టిన సంఘటన మండల పరిధిలోని ఐలపురంలో గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నార్ల సాయిలు(57) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందాడు. ఒక్కగానొక్క కూతురు రేణుక తన తండ్రి సాయిలుకు తలకొరివి పెట్టింది. దీంతో కుటుంబ సభ్యులు,గ్రామస్తులు, బంధువుల రోధనలు మిన్నంటాయి.


Similar News