Nalgonda Congress MahaDharna మూసీ ప్రాజెక్ట్‌కు మద్దతుగా నల్గొండ కాంగ్రెస్ నేతల ధర్నా

Update: 2024-10-26 08:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: మూసీ పునరుజ్జీవనానికి మద్దతుగా నల్గొండ కాంగ్రెస్ (Congress) నేతలు మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy), ఎమ్మెల్యే అనిల్ (MLA Anil) ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పోచంపల్లి దగ్గర మూసీ బ్రిడ్జిపై రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విపక్షాలు దుర్బుద్ధితో మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ (BRS) నేతల తీరు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. మూసీ ప్రాజెక్ట్‌ను అడ్డుకుంటే ప్రజలు తిరగబడతారు.


Similar News