నిజామాబాద్ సెల్‌బే‌లో సందడి చేసిన నటి శ్రీముఖి

మల్టీబ్రాండ్ రిటైల్ చైన్ సెల్‌బే‌ షోరూమ్‌ను నిజామాబాద్‌లో ప్రారంభించారు...

Update: 2024-03-27 16:51 GMT

దిశ, వెబ్ డెస్క్: మల్టీబ్రాండ్ రిటైల్ చైన్ సెల్‌బే‌ తెలంగాణలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఈ సెల్ బే షోరూమ్‌ను నిజామాబాద్ పట్టణంలో టాలీవుడ్ నటి శ్రీముఖి ప్రారంభించారు. తెలంగాణలోని 2 టైర్ టౌన్‌లో ఇంత అద్భుతమైన షోరూమ్‌లో భాగమైనందుకు ఈ సందర్బంగా ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ షోరూమ్‌ను ప్రారంభించేందుకు అవకాశం ఇచ్చిన సెల్ బే మేనేజ్‌మెంట్‌ను శ్రీముఖి అభినందించారు. శ్రీముఖి మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ ప్రజలకు సెల్‌బే షోరూమ్‌ గొప్ప అవకాశమని చెప్పారు. ఇక్కడ మొబైల్ హ్యాండ్‌సెట్‌లు, ఉపకరణాలు, స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు దొరుకుతాయని చెప్పారు.


నిజామాబాద్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలందరూ సెల్‌బే షోరూమ్‌ని సందర్శించి మొబైల్ హ్యాండ్‌సెట్ స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలని శ్రీముఖి పిలుపునిచ్చారు. వీటిపై ప్రారంభ ఆఫర్లు ఉన్నాయని.. ప్రజలు వినియోగించుకోవాలని ఆమె కోరారు. మొదటి మూడు వేల మంది కస్టమర్లకు కేవలం రూ. 99లకే Branded Neckband అందిస్తున్నామని చెప్పారు. ఆండ్రాయిడ్ టీవీ ప్రారంభ ధర కేవలం రూ. 7999 మాత్రమేనన్నారు. బ్రాండెడ్ టీవీ‌ల కొనుగోలుపై సౌండ్ బార్ విత్ WOOFER ఉచితంగా లభిస్తాయని తెలిపారు. Andriod హ్యాండ్‌సెట్ కేవలం రూ. 5,999కే లభిస్తుందన్నారు.  IPHONE నెలవారీ EMI పద్ధతిలో కేవలం రూ. 2705కే పొందవచ్చని చెప్పారు. ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలు‌పై ఖచ్చితమైన బహుమతి పొందవచ్చన్నారు. రూ.15 వేలపైబడిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే Rs.2499 విలువైన బ్రాండెడ్ ఇయర్ బడ్స్ ఉచితంగా అందిస్తున్నట్లు శ్రీముఖి తెలిపారు. 


సెల్ బే వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సోమ నాగరాజు మాట్లాడుతూ అత్యుత్తమ ఉత్పత్తులు, సేవలను అందించడం ద్వారా సెల్‌బే ఎల్లప్పుడూ మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పారు. మొబైల్ హ్యాండ్‌సెట్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఫైనాన్స్ ఆప్షన్లు పొందవచ్చని ఆయన తెలిపారు.  దక్షిణ భారతదేశంలో నలుమూలకు సేవలు అందించడమే సెల్ బే లక్ష్యమని చెప్పారు. అందుకే 3 టైర్ నగరాల్లోకి ప్రవేశించడం ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్‌లోనూ సెల్‌బేను ప్రారంభించామని స్పష్టం చేశారు. Xioami, Realme, SAMSUNG, VIVO, OPPO, ONE PLUS, POCO, APPLE మొదలైన మొబైల్, స్మార్ట్ టీవీ బ్రాండ్‌లకు సెల్‌బే One Stop Hub అని సోమ నాగరాజు వివరించారు.


నిజామాబాద్‌ నగరంలో  సొగసైన వాతావరణంలో సెల్ బే షోరూమ్‌ ప్రారంభించబడిందని స్ట్రాటజీ & ప్లానింగ్ డైరెక్టర్ సుహాస్ నల్లచెరు అన్నారు. సెల్‌బేలో మొబైల్ ఇన్సూరెన్స్ కూడా అందుబాటులో ఉందని తెలిపారు. అన్ని ఉత్పత్తులు నిజాయితీ ధరలకే లభిస్తాయని చెప్పారు. మొబైల్ హ్యాండ్‌సెట్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయని, ఉత్తమ ప్రారంభ ఆఫర్లు కలిగి ఉన్నాయని వినియోగదారులందరూ కొత్త షోరూమ్‌ను సందర్శించాలని కోరారు. సెల్‌బే ఎల్లప్పుడూ కస్టమర్ సర్వీస్‌కు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందుకే తమ స్టోర్ల పరిసరాల్లో ఉచిత హోమ్ డెలివరీ సౌకర్యం ఉందని చెప్పారు.


సెల్‌బే మార్కెటింగ్ డైరెక్టర్ సుదీప్ నల్లచెరు మాట్లాడుతూ కస్టమర్ కొనుగోలు విధానం కొత్త పోకడలను అనుసరిస్తుందని, ఇందుకు అనుగుణంగా తమ మార్కెటింగ్ స్ట్రాటజీ మలుచుకుంటున్నామని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ పద్ధతులను సైతం అనుసరిస్తున్నామని పేర్కొన్నారు..

ఈ కార్యక్రమంలో CELLBAY టీమ్ సభ్యులు, బ్రాండ్స్ అధికారులు, కుటుంబ సభ్యులు & స్నేహితులు, నిజామాబాద్ కస్టమర్‌లు గ్రాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈవెంట్‌ను విజయవంతం చేశారు.



Similar News