Konda Surekha: టైమ్ కు రాకుంటే ఎట్లా? ప్రభుత్వ వైద్యులపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం

సమయ పాలన పాటించని ప్రభుత్వ వైద్యులపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-08-05 06:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: డ్యూటీ టైమ్ పాటించడని ప్రభుత్వ వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె వరంగలోని ప్రభుత్వ నేత్ర వైద్యశాలను సడెన్ గా విజిట్ చేశారు. కొంత మంది వైద్యులు, సిబ్బంది విధులకు హాజరుకాకుండానే రికార్డులలో సంతకాలు చేయడంపై ఆమె సీరియస్ అయ్యారు. ఈ విషయాన్ని గమనించిన మంత్రి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎట్లా అని నిలదీశారు. అలాంటి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఆసుపత్రిలో సమగ్ర నివేదిక రూపొందించి ఇవ్వాలని ఆసుపత్రి సూపరిండెంట్ కు సూచించారు. ఈ సందర్భంగా వైద్యులు రిజిస్టర్లను, రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుకున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

Tags:    

Similar News