మంత్రి పొన్నం లీగల్ నోటీసులు.. MLA పాడి కౌశిక్ రెడ్డి రియాక్షన్ ఇదే..!

‘ఫ్లై యాష్’ తరలింపులో అవకతవకలు అంటూ తనపై చేసిన ఆరోపణలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జోగినపల్లి సంతోష్, నమస్తే తెలంగాణ పత్రిక, టీ న్యూ ఛానెల్‌కు నోటీసులు పంపారు.

Update: 2024-06-23 08:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘ఫ్లై యాష్’ తరలింపులో అవకతవకలు అంటూ తనపై చేసిన ఆరోపణలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జోగినపల్లి సంతోష్, నమస్తే తెలంగాణ పత్రిక, టీ న్యూ ఛానెల్‌కు నోటీసులు పంపారు. ఇక, లీగల్ నోటీసులపై పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించొద్దని వార్నింగ్ ఇచ్చారు. బ్లాక్ బుక్‌లో అధికారుల పేర్లు రిజస్టర్ చేస్తున్నామన్నారు. రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన వారికి తమ ప్రభుత్వం వచ్చాక బ్లాక్ డేస్ ఉంటాయని హెచ్చరించారు.

నిబంధనల ఉల్లంఘనలపై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఒక్క కల్యాణ లక్ష్మీ చెక్కు కూడా స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేతికి వెళ్లొద్దని పొన్నం గతంలో ఎమ్మార్వోతో మాట్లాడిన ఆడియోను ఆయన వినిపించారు. ఇప్పటికే మూడు నెలల పెన్షన్‌ను ప్రభుత్వం ఎగ్గొట్టిందని కాంగ్రెస్ సర్కారుపై కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లీగల్ యాక్టీవిటీస్‌ని లీగల్ నోటీసులు పంపి ఆపాలనుకుంటే కలవదు బ్రదర్ అంటూ సీరియస్ అయ్యారు. లీగల్ నోటీసులకు తమ లీగల్ టీమ్ బరాబర్ జవాబు చెబుతుందన్నారు. ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ అయిన పొన్నం ఓవర్ లోడ్ లారీలను వెళ్లనిస్తారా అని ప్రశ్నించారు. 34 టన్నుల లోడుతో వెళ్లాల్సిన లారీలు 80 టన్నుల లోడ్‌తో వెళ్లడంపై సమాధానం చెప్పాలని మంత్రి పొన్నంను డిమాండ్ చేశారు.


Similar News