ఐఏఎస్ ఆఫీసర్ అమోయ్ కుమార్ ను సుదీర్ఘంగా విచారించిన ఈడీ

రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్(Amoy Kumar) ఈడీ(ED) విచారణ ముగిసింది.

Update: 2024-10-23 13:17 GMT

దిశ, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్(Amoy Kumar) ఈడీ(ED) విచారణ ముగిసింది. బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు దాదాపు ఎనిమిది గంటలపాటు ఈడీ అధికారులు అమోయ్ ను విచారించారు. అమోయ్ గతంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించినపుడు.. మహేశ్వరం మండలం నాగారంలోభూదాన్ భూముల బదిలీపై ప్రధానంగా ఈడీ విచారణ సాగింది. రూ. వందల కోట్ల విలువైన భూములు కేవలం రూ. 42 కోట్లకే గత ప్రభుత్వ నేతలకు కట్టబెట్టడంపై ఈడీ పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. కాగా తమను బెదిరించి తమ భూములు బలవంతంగా లాక్కున్నారని స్థానిక రైతులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటి ఆధారంగా అధికారులు అమోయ్ కుమార్ ను విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. కాగా నేడు సుదీర్ఘ విచారణ అనంతరం మీడియా కంటపడకుండా అమోయ్ వెళ్లిపోయారు.   

Tags:    

Similar News