సీతక్క రిక్వెస్టుకు మంత్రి పొంగులేటి సానుకూల స్పందన

ములుగు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మంత్రి సీతక్క, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరారు.

Update: 2024-10-14 15:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ములుగు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మంత్రి సీతక్క, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరారు. ములుగు తన సొంత నియోజకవర్గమని.. చాలా కాలంగా అక్కడ పలు రెవెన్యూ సంబంధ సమస్యలున్నాయని, ఎమ్మార్వో కార్యాలయాలకు నూతన భవనాల మంజూరు చేయాలని ఆమె కోరారు. సోమవారం సీతక్క, రెవెన్యూ మంత్రిని ఆయన పేషీలో స్వయంగా కలిసి విన్నవించారు. అయితే, మంత్రి సీతక్క రిక్వెస్టుకి పొంగులేటి సానుకూలంగా స్పందించి.. పరిశీలించిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినట్టు తెలిసింది.


Similar News