ఇప్పుడు ఏమి చేయాలి స్పీకర్ సార్..? బండి వ్యాఖ్యలకు మంత్రి KTR కౌంటర్

ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా గురువారం లోక్ సభలో మాట్లాడిన బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం

Update: 2023-08-11 05:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా గురువారం లోక్ సభలో మాట్లాడిన బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ అంటే ఖాసీం చంద్రశేఖర రజ్వీ అంటూ బండి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘ప్రధాని ఇంటిపేరును అవమానకరంగా పిలిచినందుకు కాంగ్రెస్ ఎంపీపై (రాహుల్ గాంధీ) అనర్హత వేటు వేశారు. మరీ ఇప్పుడు.. తెలంగాణాకు చెందిన ఒక బీజేపీ ఎంపీ (బండి సంజయ్) నిన్న జరిగిన లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా తెలంగాణాకి రెండుసార్లు ఎన్నికైన పాపులర్ సీఎం కేసీఆర్‌ను అత్యంత నీచమైన భాషలో కించపరిచారు’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ట్యాగ్ చేసిన మంత్రి కేటీఆర్.. ‘‘మీరు, మేము ఇప్పుడు ఏమి చేయాలి స్పీకర్ సార్..?’’ అని ప్రశ్నించారు. 

Tags:    

Similar News