ఈనెల 6న రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ.. ఆర్ అడ్ బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి రివ్యూ

ఆర్ అడ్ బీ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి రివ్యూ నిర్వహించారు.

Update: 2024-07-02 11:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 6వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కాబోతుండటం ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో పదేళ్లుగా అపరిష్కృతంగా మారిన విభజన అంశాలకు ఓ పరిష్కార మార్గం దొరకవచ్చు అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సచివాలంయంలోని తన చాంబర్ లో ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీలో చర్చించాల్సిన విభజన అంశాలపై మంత్రి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ పరిధిలోని ఆస్తుల వివరాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. లేక్ వ్యూ, గ్రీన్ ల్యాండ్స్, మంజీరా అతిథి గృహాలపై మంత్రి చర్చించారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్లపై వెంకట్ రెడ్డి సమీక్షలో అధికారులతో చర్చించారు.

Tags:    

Similar News