ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం : ఎమ్మెల్యే కేపీ

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి

Update: 2023-09-18 13:18 GMT

దిశ,కుత్భుల్లాపూర్: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు,బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ను తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


Similar News