గణనాథుడి పూజల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే
కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని బీజేపీ కార్యాలయం వద్ద వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడి మండపంలో శనివారం జరిగిన పూజల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్,
దిశ, కూకట్పల్లి: కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని బీజేపీ కార్యాలయం వద్ద వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడి మండపంలో శనివారం జరిగిన పూజల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు పాల్గొన్నారు. అదే విధంగా శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణలు పూజల్లో పాల్గొన్నారు. నియోజకవర్గం పరిధిలోని ఆయా డివిజన్లలో వినాయక మండపాల వద్ద కార్పొరేటర్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.