గణనాథుడి పూజల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

కూకట్​పల్లి నియోజకవర్గం పరిధిలోని బీజేపీ కార్యాలయం వద్ద వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడి మండపంలో శనివారం జరిగిన పూజల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్​,

Update: 2024-09-07 13:13 GMT

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లి నియోజకవర్గం పరిధిలోని బీజేపీ కార్యాలయం వద్ద వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడి మండపంలో శనివారం జరిగిన పూజల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్​, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు పాల్గొన్నారు. అదే విధంగా శేషాద్రి నగర్​ కమ్యూనిటీ హాల్​లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్​ జూపల్లి సత్యనారాయణలు పూజల్లో పాల్గొన్నారు. నియోజకవర్గం పరిధిలోని ఆయా డివిజన్​లలో వినాయక మండపాల వద్ద కార్పొరేటర్​లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Similar News