రంగధాముని చెరువు వద్ద పైప్లైన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
బాలానగర్ డివిజన్ పరిధిలోని రంగధాముని చెరువు వద్ద జరుగుతున్న డ్రైనేజీ పైప్లైన్ పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు.
దిశ, కూకట్పల్లి: బాలానగర్ డివిజన్ పరిధిలోని రంగధాముని చెరువు వద్ద జరుగుతున్న డ్రైనేజీ పైప్లైన్ పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బాలాజీనగర్ డివిజన్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు మీద నిలుస్తున్న వరద నీటిని పైప్లైన్ ద్వారా రంగధాముని చెరువు సర్ ప్లస్ నాలాలో కలిసే విధంగా పైప్లైన్ ఏర్పాటు చేయడం జరిగుతుందని అన్నారు. పైప్లైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈఈ సత్యనారాయణ, జలమండలి జిఎం ప్రభాకర్, డీఈ ఆనంద్, ఏజిఎం రషీద్ తదితరులు పాల్గొన్నారు.