రంగధాముని చెరువు వద్ద పైప్​లైన్​ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

బాలానగర్​ డివిజన్​ పరిధిలోని రంగధాముని చెరువు వద్ద జరుగుతున్న డ్రైనేజీ పైప్​లైన్​ పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు.

Update: 2024-06-28 15:02 GMT

దిశ, కూకట్​పల్లి: బాలానగర్​ డివిజన్​ పరిధిలోని రంగధాముని చెరువు వద్ద జరుగుతున్న డ్రైనేజీ పైప్​లైన్​ పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బాలాజీనగర్​ డివిజన్​ పరిసర ప్రాంతాల్లో రోడ్డు మీద నిలుస్తున్న వరద నీటిని పైప్​లైన్​ ద్వారా రంగధాముని చెరువు సర్​ ప్లస్​ నాలాలో కలిసే విధంగా పైప్​లైన్​ ఏర్పాటు చేయడం జరిగుతుందని అన్నారు. పైప్​లైన్​ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈఈ సత్యనారాయణ, జలమండలి జిఎం ప్రభాకర్​, డీఈ ఆనంద్​, ఏజిఎం రషీద్​ తదితరులు పాల్గొన్నారు.

Similar News