అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే
మూసాపేట్ డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
దిశ, కూకట్పల్లి: మూసాపేట్ డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం మోతీనగర్లోని వార్డు కార్యాలయంలో స్థానిక ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘాలు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు.
మూసాపేట్ శక్తినగర్లో పార్కు, కమ్యునిటిహాల్లను, అదే విధంగా రామారావునగర్ కాలనీ, స్నేహపురి కాలనీకి అనుసంధానంగా ఉన్న నాలా పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. అనంరతం వార్డు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్థానికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. స్థానికంగా గుర్తించిన, స్థానికులు ఫిర్యాదు చేసిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మూసాపేట్ సర్కిల్ డీసీ రమేష్, డీఈ శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్, సిహెచ్. సత్యనారాయణ, అంబటి శ్రీనివాస్, నాగుల సత్యం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.