తహశీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ మహిళా మోర్చా ధర్నా..

ఉప్పల్ తహశీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు ఆందోళనకు దిగారు.

Update: 2024-07-03 12:11 GMT

దిశ, ఉప్పల్ : ఉప్పల్ తహశీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఎన్నికల వాగ్ధానాలు అమలులో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని శిల్పారెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన వాగ్ధానం మేరకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని మేకల శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. మొదటి దశలో మండల తహశీల్దార్ లకు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో వినతిపత్రాలు ఇస్తున్నామని, వారం రోజుల లోపు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని శిల్పారెడ్డి హెచ్చరించారు. అనంతరం ఉప్పల్ తహశీల్దార్ వాణిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Similar News