తెలంగాణలో అండర్ పాస్, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలి

హైదరాబాద్ సిటీ లోపల ట్రాఫిక్ వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయని, ప్రమాదాల నివారణ కోసం అండర్ పాస్, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని పార్లమెంటులో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడారు.

Update: 2024-08-08 15:58 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : హైదరాబాద్ సిటీ లోపల ట్రాఫిక్ వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయని, ప్రమాదాల నివారణ కోసం అండర్ పాస్, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని పార్లమెంటులో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 1947 నుండి 2004 లోపు ఎన్ని కిలోమీటర్ల నేషనల్ హైవేలు నిర్మాణం అయ్యాయో.. గత పదేళ్లలో అంతకంటే ఎక్కువ కిలోమీటర్లు హైవేలు నిర్మాణం అయ్యాయన్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ..హైదరాబాద్ నుండి ఛత్తీస్ గడ్..హైదరాబాద్ నుండి నాగపూర్ జాతీయ రహదారులు నిర్మాణం అయినట్లు తెలిపారు. కానీ హైదరాబాద్ సిటీ లోపల ట్రాఫిక్ పెరిగిపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగాయని, అందుకోసం అండర్ పాస్, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి కి విజ్ఞప్తి చేశారు. జీడిమెట్ల చౌరస్తా దగ్గర పది ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన దాదాపు 60 మంది

    విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు వెల్లడించారు. విజయవాడ నేషనల్ హైవే పై రెండు ఓవర్ బ్రిడ్జిలు...అలాగే ఛత్తీస్ గడ్ హైవే పై రెండు ఓవర్ బ్రిడ్జిలు..కొంపల్లి నుంచి నాగపూర్ హైవేపై ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం చేయాలని కోరారు. ఈ మార్గాలలో మెట్రో రైలు నిర్మాణం చేయాలని డిమాండ్ కూడా ఉందన్నారు. ఓవర్ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి కాబట్టి ఈ రెండిటిని కలిపి కోఆర్డినేట్ చేసుకొని చేపడితే తక్కువ ఖర్చు అవుతుందన్నారు. ఈటల రాజేందర్ అభ్యర్థనపై కేంద్ర రోడ్డు రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ మాట్లాడుతూ..హైదరాబాద్ రింగ్ రోడ్

    కోసం 70 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పనులు తాము చేస్తామని చెప్పారని, 50 శాతం ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్నారు. అది పూర్తి అవ్వగానే నిర్మాణం చేపడతామన్నారు. ఈ విషయమై ప్రస్తుత ముఖ్యమంత్రిని కూడా సంప్రదించినట్లు తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్ హైవే రోడ్డుపై చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయని, చాలామంది విద్యార్థులు చనిపోయారని కూడా మా దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంపై త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తాం మని, మిగతా పనులు అన్నీ కూడా చేపడతామని నితిన్ గడ్కారీ హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News