అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. పీర్జాదిగూడ మేయర్

వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీర్జాదిగూడ మేయర్ అమర్ సింగ్ సూచించారు.

Update: 2024-09-01 14:43 GMT

దిశ, మేడిపల్లి : వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీర్జాదిగూడ మేయర్ అమర్ సింగ్ సూచించారు. ఈ సందర్భంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజల ఇబ్బందులు తెలుసుకోవాలని కార్పొరేషన్ లోని పలుకాలనీలలో పర్యటించారు. లోతట్టు ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

పలు కాలనీలలో చెట్ల కొమ్మలు విరిగిపాడ్డాయని, రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అన్నారు. అధికారులు వరద ఉదృతి తగ్గేవరకు ప్రజలకు సహాయక చర్యలు చేపడుతూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రామంలో పీర్జాదిగుడ మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు డీఈ, ఆర్ఓ, సూపర్వైజర్లు మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది, కాలని వాసులు తదితరులు పాల్గొన్నారు.


Similar News