Kukatpally MLA : కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుంది

కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తే

Update: 2024-10-28 09:21 GMT

దిశ, కూకట్ పల్లి : కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుందని(Kukatpally MLA)కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచల  వ్యాఖ్యలు చేశారు. ఈరోజు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి చేతకాకనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు పార్టీ చేసుకుంటే రేవ్ పార్టీ అంటున్నారు డ్రగ్స్ దొరికాయి అంటున్నారు. పోలీసుల భార్యలు న్యాయం కావాలని ధర్నాలు చేస్తున్నారు, రోడ్ల పైకి వస్తే బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కి కనబడదు అని విమర్శించారు.

ఇంట్లో కుటుంబ సభ్యులు పార్టీ చేసుకుంటే మాత్రం గంటలో ప్రెస్ మీట్ పెట్టి తిట్టడం మాత్రమే బండి సంజయ్ కు తెలుసని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైఖరి ఒక్కటే బి పార్టీ పై గుడ్డ కాల్చి వేయడం అని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల డ్రామాలు ప్రజలు చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మళ్ళీ ఈ ఎన్నికలు పెడితే ఏ పార్టీకి ప్రజలు తీర్పు చెపుతారో అర్థం అవుతోందని అన్నారు.


Similar News