సున్నం చెరువు బాధితులను పరామర్శించిన కేటీఆర్​

కూకట్​పల్లి నియోజకవర్గం పరిధి అల్లాపూర్​ డివిజన్​ పరిధిలోని

Update: 2024-10-28 14:25 GMT

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లి నియోజకవర్గం పరిధి అల్లాపూర్​ డివిజన్​ పరిధిలోని సున్నం చెరువులో హైడ్రా కూల్చి వేతలలో ఇండ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలను సోమవారం మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ పరామర్శించారు. తన స్కూల్​ బ్యాగును, పుస్తకాలను సైతం తీసుకోకుండా ఇల్లు కూల్చేశారని మీడియా ముందు చెప్పిన చిన్నారి వేదశ్రీ ని కేటీఆర్ పలకరించారు. చిన్నారి వేదశ్రీని​ ఎత్తుకొని తనకు కొత్త స్కూల్​ బ్యాగ్​ను అందజేశారు. హైడ్రా బాధితులకు అండగా ఉంటానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పోరేటర్​ సబీహా బేగం పాల్గొన్నారు.


Similar News