రామునిపట్లలో మరోసారి దొంగల బీభత్సం

రాముని పట్లలో దొంగలు మరోసారి చేతివాటం చూపించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం

Update: 2024-09-20 11:54 GMT

దిశ, చిన్నకోడూరు : రాముని పట్లలో దొంగలు మరోసారి చేతివాటం చూపించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన దమ్మ యాదవ రెడ్డి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. యాదవ రెడ్డి గత నాలుగు నెలల నుంచి సిద్దిపేటలో ఉంటున్నాడు. ఎవరూ లేని సమయంలో తన ఇంటి తాళాలు పగులగొట్టి కబోర్డ్ లో ఉన్న 2 తులాల బంగారం, 16 తులాల వెండి, రూ. 520 రూపాయల నగదు ను దొంగిలించారని తెలిపారు. ఈ సంఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. గ్రామాల్లో పోలీసుల పెట్రోలింగ్ నిర్వహించకపోవడం వల్లనే దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.


Similar News