కోల్‌కతా ఘటన.. నృత్య రూపంలో జూనియర్ డాక్టర్ల నిరసన..

Update: 2024-08-16 15:50 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : కోల్‌కతాలో వైద్యురాలిని అమానుషంగా మానభంగం చేసి హత్య చేసిన నేరస్తులకు కఠిన శిక్ష విధించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల, సురభి మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు నిరసన ర్యాలీ నిర్వహించి, పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద జూనియర్ డాక్టర్లపై జరుగుతున్న అఘాయిత్యాలపై నృత్య రూపకంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ...బాధిత వైద్యురాలి కుటంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జూనియర్ డాక్టర్లకు రక్షణ కల్పించాలన్నారు. మెడికల్ కాలేజీల్లో ఆసుపత్రులో మౌళిక వసతుల కల్పనతో పాటుగా, వైద్యులకు సెక్యూరిటీ మెరుగుపరచాలన్నారు. డాక్టర్లకు డ్యూటీ రూమ్ లు అందుబాటులో ఉంచాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News