రహదారి పై కుంగిన బ్రిడ్జి.. రాకపోకలకు అంతరాయం..

చిన్నశంకరంపేట మండలం టీ. మాందాపూర్ గ్రామ రహదారి పై పొంగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Update: 2024-09-03 13:37 GMT

దిశ, చిన్నశంకరంపేట : చిన్నశంకరంపేట మండలం టీ. మాందాపూర్ గ్రామ రహదారి పై పొంగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంగళవారం కుంగిన బ్రిడ్జిని పరిశీలించారు. అక్కడి ప్రజలు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే హనుమంతరావును కొరారు. అప్పటి వరకు తాత్కాలిక రాకపోకలు, సాగేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు, ఫోన్లో సమాచారం అందించారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాన సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, అమరసేనారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, రమేష్ గౌడ్, ఎర్రి కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.


Similar News