MLA : ప్రభుత్వం వడ్లకు, కందులకు, మక్కలకు రూ. 500 బోనస్ ఇవ్వాలి

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రభుత్వం వడ్లకు, కందులకు, మక్కలకు రూ. 500 బోనస్ ఇవ్వాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Narsapur MLA Sunitha లక్ష్మారెడ్డి ) అన్నారు

Update: 2024-10-28 10:53 GMT

దిశ, నర్సాపూర్ : కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రభుత్వం వడ్లకు, కందులకు, మక్కలకు రూ. 500 బోనస్ ఇవ్వాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Narsapur MLA Sunitha లక్ష్మారెడ్డి ) అన్నారు. సోమవారం నర్సాపూర్ శివంపేట మండలాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సునితారెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వం రైతులకు సంబంధించిన దళారుల వ్యవస్థను నిర్మూలించాలన్న ఆలోచనతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రెండు వేల మూడు వందల ఇరవై, బీ గ్రేడ్ ధాన్యానికి ₹2300 ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నానిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కొనుగోలు సెంటర్ ల నిర్వాహకులకు సూచించారు. లారీల కొరత ఉన్నట్టయితే ట్రాక్టర్ ల ద్వారా ధాన్యాన్ని తీసుకుపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శేఖర్, సత్యం గౌడ్, నర్సింగ్ రావు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.


Similar News