ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి : సిద్దిపేట అడిషనల్ కలెక్టర్

ప్రజావాణి లో ప్రజలు సమర్పించిన అర్జీలను సత్వరమే

Update: 2024-10-07 11:47 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ప్రజావాణి లో ప్రజలు సమర్పించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజావాణి అనేది గొప్ప కార్యక్రమం అన్నారు. ప్రజావాణి కార్యక్రమంపై నమ్మకం తో కార్యాలయం కి వచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే విధంగా పని చేయాలని జిల్లా అధికారులకు అడిషనల్ కలెక్టర్ సూచించారు. భూ సంబంధిత, రెండు పడక గదుల ఇళ్లు, ఆసరా పింఛన్లు ఇతరత్రా మొత్తం కలిపి 22 దరఖాస్తులు ప్రజావాణికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ లక్ష్మి కిరణ్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News