‘దిశ’ ఎఫెక్ట్.. కదిలిన పోలీసు యంత్రాంగం

సంగారెడ్డి జిల్లాలో ఆటో డ్రైవర్లు తమ ఆటోలకు 'మై ఆటో ఇస్ సేఫ్' స్టిక్కర్లు

Update: 2024-07-06 13:09 GMT

దిశ,కంది : సంగారెడ్డి జిల్లాలో ఆటో డ్రైవర్లు తమ ఆటోలకు 'మై ఆటో ఇస్ సేఫ్' స్టిక్కర్లు వేసుకోకుండా ప్రయాణిస్తున్న అంశంపై దిశ ఈ నెల 6న 'రోడ్లపై నాట్ సేఫ్ ఆటోలు' అనే ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ స్పందించారు. జిల్లాలో ఏ ఒక్క ఆటోకు కూడా స్టిక్కర్లు లేకుండా తిరగరాదని, వారం రోజుల్లో అన్ని ఆటోలకు స్టిక్కర్లు వేయించేలా చూడాలని పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా శనివారం సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో మొత్తం 113 ఆటోలకు స్టిక్కర్లు వేయించారు. దీంతో ప్రజలు దిశ కథనం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Similar News