Eatala Rajender : ఎంపీ ఈటల‌తో మల్లన్న నవ్వులే నవ్వులు! ఓ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం

మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఏడున్నర కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు.

Update: 2024-10-05 08:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఏడున్నర కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎంపీ ఈటల మరోసారి ఒకే కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో మల్లారెడ్డి ఎప్పటిలానే ఎంపీ ఈటలతో నవ్వులు పూయించారు. ఈ క్రమంలోనే ఈటలకు శాలువ కప్పి మల్లారెడ్డి సత్కరించారు. శంకుస్థాపన కార్యక్రమంపై ఎక్స్ వేదికగా శనివారం ఈటల పోస్ట్ చేశారు.

మల్కాజిగిరి పార్లమెంట్ అనేది దేశంలోనే అతిపెద్ద పార్లమెంటే కాకుండా కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరమని ఎంపీ ఈటల పేర్కొన్నారు. ఇక్కడ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, రోడ్ల సమస్యలు ఎంత చేసినా తరగని నియోజకవర్గమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారని, కేంద్ర ప్రభుత్వం, సీఎస్ఆర్ పరంగా ప్రజల మౌలిక వసతుల కల్పనలో మేమంతా కలిసికట్టుగా పనిచేసి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలసమస్యలు తీర్చడంలో ముందు భాగంలో ఉంటామని తెలియజేస్తున్నాని ఎక్స్‌లో ఫోటోలు షేర్ చేశారు. 


Similar News