సింగూరుకు భారీగా వరద నీరు

సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29.678 టీఎంసీలకు చేరింది.

Update: 2024-10-05 11:48 GMT

దిశ, ఆందోల్ : సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29.678 టీఎంసీలకు చేరింది. దీంతో అధికారులు రెండు గేట్లను 1.50 మీటర్లు పైకెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. రెండు గేట్ల ద్వారా 16,284, జెన్ కో ద్వారా 2823 క్యూసెక్కులు కలిపి 19107 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 14,168 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు వస్తుండడంతో మంజీరా నది పరీవాహక ప్రాంత ఆయకట్టు రైతులు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. చేపలు పట్టేందుకు జాలర్లు నీళ్లలోకి వెళ్లరాదని ఇరిగేషన్ అధికారులు కోరారు. 

Tags:    

Similar News