రుద్రారం చెరువు బుంగ పూడ్చివేత..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామ శివారులోని చెరువు కట్టకు సోమవారం బుంగపడి నీరు వృధాగా పోయింది.

Update: 2024-09-03 14:39 GMT

దిశ, చిన్నశంకరంపేట : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామ శివారులోని చెరువు కట్టకు సోమవారం బుంగపడి నీరు వృధాగా పోయింది. సమాచారం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎంపీడీవో దామోదర్, పంచాయతీ కార్యదర్శి అనురాధ మంగళవారం గ్రామ చెరువు వద్దకు వెళ్లి పరిశీలించి బుంగను ఇసుక బస్తాలతో రైతుల చే పూడ్చివేశారు. అలాగే కొరివి పల్లి గ్రామంలో ఓ ఇల్లు కూలిపోగా, ఆ కుటుంబాన్ని గ్రామపంచాయతీకి ఎంపీడీవో దామోదర్, చంద్రశేఖర్ సందర్శించారు. దీంతో గ్రామంలోని రైతులు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అధికారులతో పాటు గ్రామ మాజీ సర్పంచ్ తో పాటు రైతులు, ప్రజలు ఉన్నారు.


Similar News