మావోయిస్టుల దాడి కలకలం.. రాకెట్ లాంచర్లతో పోలీసుల బేస్ క్యాంప్ పై దాడి

తెలంగాణలో మావోయిస్టుల దాడి కలకలం రేపుతుంది.

Update: 2024-09-25 15:29 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మావోయిస్టుల దాడి కలకలం రేపుతుంది. బుధవారం సాయంత్రం సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని క్యాంపు పై మావోయిస్టుల దాడి చేసినట్లు తెలుస్తుంది. రాకేట్ లాంచర్ తో పుసుగుప్ప బేస్‌ క్యాంపుపై మావోలు దాడి చేయగా.. గురితప్పి బేస్ క్యాంప్ పక్కన పడిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. అలాగే బేస్‌ క్యాంపుకు కొద్ది దూరం నక్కి.. కాల్పులు జరపగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టుల దాడిని విజయవంతంగా తిప్పికొట్టారు. దాదాపు గంటపాటు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరగ్గా..ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.


Similar News