food : పిల్లలకు పెట్టే ఆహరంలో పురుగులు

మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం.. ఆహారం అందించడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలిపారు‌‌.

Update: 2024-10-25 15:46 GMT

దిశ, మహమ్మదాబాద్: మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం.. ఆహారం( food )అందించడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలిపారు‌‌. అలాగే అన్నంలో పురుగులు వస్తున్నాయని, చెప్పిన పట్టించుకోవడంలేదని వాపోయారు. దీంతో ఈ విషయం లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులు తెలుసుకొని ..వచ్చి చూసిన నిజమైనే తేలింది. పుచ్చిపోయిన శనిగలు కండ్లకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే అధికారుల పర్యవేక్షణ కరువైందని చెప్పవచ్చు అని అన్నారు. మీ పిల్లలకు ఇలానే చేసి పెడతారా..? అని ప్రశ్నించారు. మళ్ళీ ఈ విధంగా జరిగితేపై అధికారులకు తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల లంబాడ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు భాషా నాయక్, మాజీ సర్పంచులు చెంప బాయి పాల్గొణ, గీత, ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు సంతోష్ నాయక్, పాండు నాయక్, శ్రీనివాస్ నాయక్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News