సార్ మాకు న్యాయం చెయ్యరా ?

గత అయిదు నెలల క్రితం జిల్లా కేంద్రం బండమీదిపల్లిలోని మల్లికార్జున వైన్స్ దగ్గర జరిగిన గొడవలో హత్య జరిగింది.

Update: 2024-10-07 15:39 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: గత అయిదు నెలల క్రితం జిల్లా కేంద్రం బండమీదిపల్లిలోని మల్లికార్జున వైన్స్ దగ్గర జరిగిన గొడవలో హత్య జరిగింది. తన కుమారుడు హత్య కేసులో పోలీసులు చార్జీషీట్ వేయకుండా కాలయాపన చేస్తున్నారని హత్యకు గురైన శ్రీకాంత్ యాదవ్ తండ్రి వెంకటేష్ ఆరోపించారు. మృతుడి కుటుంబ సభ్యులు బీసీ సమాజ్ అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ తో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో.. కలెక్టర్ విజయేందిర బోయి ని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. హత్య జరిగి అయిదు నెలలైనా చార్టీషీట్ వేయకుండా అసలు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక్కడ తమకు న్యాయం జరగకపోతే రాష్ట్ర బీసీ కమిషన్,హ్యూమన్ రైట్స్ లో ఫిర్యాదు చేసి..న్యాయ పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. 


Similar News