అయ్యా లేవయ్యా బస్సొచ్చింది..వృద్ధురాలి కన్నీటి ఆవేదన

నాగర్ కర్నూల్ బస్టాండ్ లో ఓ వృద్ధుడు మృతి చెందాడు.

Update: 2024-10-05 16:25 GMT

దిశ,నాగర్ కర్నూల్ :-నాగర్ కర్నూల్ బస్టాండ్ లో ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం...అడగుల మండలం కొనగల్ గ్రామానికి చెందిన కొమ్ము వెంకటయ్య (70) అతని భార్య వెంకటమ్మ తో దర్గాకు వెళ్దామని నాగర్ కర్నూల్ బస్టాండ్ కు వచ్చారు. కల్వకుర్తి బస్సు వచ్చేవరకు బస్టాండులో కూర్చున్నారు. బస్సు వచ్చిన సంగతి తెలుసుకొని వృద్ధుని భార్య పిలిస్తే పలకడం లేదు. దీంతో బస్టాండ్లో ఉన్న కంట్రోలర్108కు సమాచారం ఇవ్వగా..వారు వచ్చి వృద్ధుడు చనిపోయినట్లు నిర్ధారించారు. పోలీసులు అంబులెన్స్ తో డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడు చనిపోయిన విషయాన్ని కొనగల్ గ్రామస్తులకు తెలిపినట్లు తెలిసింది.


Similar News