మైసమ్మ దేవతను దర్శించుకున్న ఎంపీ

జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన మండల పరిధిలోని మహిమాన్విత పర్వతాపూర్ మైసమ్మ ఆలయాన్ని గురువారం మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ దర్శించుకున్నారు.

Update: 2024-10-10 09:11 GMT

దిశ, నవాబుపేట: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన మండల పరిధిలోని మహిమాన్విత పర్వతాపూర్ మైసమ్మ ఆలయాన్ని గురువారం మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ దర్శించుకున్నారు. అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం..అర్చకులు ఘనస్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు.మైసమ్మ దేవత ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఎంపీ ఆకాంక్షించానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపి నాయకులు పాల్గొన్నారు.


Similar News