బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యం.. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో డీకే అరుణ

దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు.

Update: 2024-10-03 15:43 GMT

దిశ, గద్వాల: దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకీ, బిజెపి పార్టీ కీ బాసటగా ప్రతీ భారతీయుడు నిలువ్వాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం గద్వాల జిల్లా కేంద్రంలో పలు వర్తక వ్యాపారులచే ఆమె బిజెపి డిజిటల్ సభ్యత్వం చేయించారు. పార్టీ పిలువు మేరకు పార్టీ సభ్యత్వ డ్రైవ్ లో డీకే అరుణ స్వయంగా పాల్గొన్నారు. గద్వాల క్లాత్ మ‌ర్చంట్ అసోసియేష‌న్ స‌భ్యులు, స్థానిక‌ శివప్ర‌సాద్ షాప్ లో ప‌లువురు అసోసియేష‌న్ సభ్యులు, స్థానికుల‌ బీజేపీ మెంబ‌ర్ షిప్ న‌మోదును డీకే అరుణ చేయించారు. అనంత‌రం గ‌ద్వాల గోల్డ్ స్మిత్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో శంకరాచారి షాపులో స్థానిక మ‌హిళ‌లు, యువ‌కులు బీజేపీ స‌భ్య‌త్వం తీసుకున్నారు. దేశం మ‌రింత అభివృద్ధి చెందాలంటే..ప్ర‌తి ఒక్క‌రూ బీజేపీ స‌భ్య‌త్వం చేసుకోవాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గద్వాల జిల్లా ముఖ్య నాయ‌కులు శివారెడ్డి, రామాంజనేయులు, కుమ్మరి శ్రీను, దేవదాసు,గీత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Similar News