బతుకమ్మ ఆడిన మంత్రి కొండా సురేఖ

నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని అచ్చంపేట నియోజకవర్గంలో మంత్రి కొండ సురేఖ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు.

Update: 2024-10-07 09:37 GMT

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతం లోని అచ్చంపేట నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు. మార్కండేయ శివాలయంలో శ్రీశ్రీ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా.. డాక్టర్ వంశీ కృష్ణ తో కలిసి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళ భక్తులతో కలిసి మంత్రి బతకమ్మ ఆడారు. అనంతరం నల్లమల కొండ పై వెలసిన ఉత్తర ద్వారంగా పిలువబడుతున్న.. శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంలో ప్రతేక పూజలు చేశారు. ఈ సందర్బంగా అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో  మాధవి, కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు డాక్టర్ తదితరులు పుష్పగుచ్చం అందజేశారు.


Similar News